అప్పు తీర్చలేదని మహిళను నరికిన వ్యక్తులు..

by Disha Web Desk 6 |
అప్పు తీర్చలేదని మహిళను నరికిన వ్యక్తులు..
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో ఇటీవల కొంత మంది చిన్న విషయాలకే కోపంతో విచక్షణ కోల్పోతున్నారు. ఈ క్రమంలో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. అప్పు తీర్చలేదని నరికి చంపేశారు. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లో నీలం దేవి అనే మహిళ ఇటీవల తన కుమార్తె వివాహం కోపం షకీల్ అనే వ్యక్తి దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకుంది. అయితే ఆర్థిక ఇబ్బందుల వలన తిరిగి అప్పు కట్టలేపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన షకీల్ తన స్నేహీతుడు జుడిన్ మియాన్‌తో కలిసి నీలం దేవిని అతి కిరాతకంగా నరికేశారు. గాయాలు ఎక్కువకావడంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also Read....

పోస్టుమార్టం చేస్తుండగా షాక్.. శవం నుంచి బుసలు కొట్టిన పాము



Next Story

Most Viewed